ఆంధ్ర ప్రదేశ్
శాసనమండలిలో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం.. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా ? లేదా ?

Bosta Vs Nimmala: ఏపీ శాసనమండలిలో పోలవరం ఎత్తు పెంపుపై వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా లేదా మంత్రి నిమ్మల సమాధానం చెప్పాలని మండలి ప్రతిపక్ష నేత బొత్స డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తుపై తాము ప్రశ్నిస్తే అధికార కూటమి నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు బొత్స.
పోలవరం గురించి మాట్లాడాలంటే వైపీపీనే మాట్లాడాలన్నారు. అయితే బొత్సకు నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చాడు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు నిమ్మల. నదుల అనుసంధానం తమ అధినేత చంద్రబాబు విధానం అన్నారు నిమ్మల. పోలవరం తామే పూర్తి చేస్తామని.. తామే నీళ్లు ఇస్తామని నిమ్మల స్పష్టం చేశారు.