ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: గత ప్రభుత్వం 117 జీవోతో పేద పిల్లలకు విద్యను దూరం చేసింది

Nara Lokesh: జగన్ జమానాపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. నాడు-నేడు పథకంపై అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు. దీంతో నాడు-నేడు పనులపై నివేదిక తెప్పించుకుంటున్నట్లు చెప్పిన నారా లోకేష్ అవకతవకలు జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

గత ప్రభుత్వం 117 జీవోతో పేద పిల్లలకు విద్యను దూరం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 12లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారు. అయితే 117 జీవో స్థానంలో త్వరలోనే మరో జీవో తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button