తెలంగాణ
బావిలో పడ్డ ఎలుగుబంటి.. కాపాడిన అటవీశాఖ అధికారులు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాకేరా గ్రామ శివారులో అడవి నుంచి తప్పిపోయి ఎలుగుబంటి బావిలో పడింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అటుగా వెళ్లిన రైతులు చూశారు. ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు.
క్రేన్, నిచ్చెనతో ఎలుగుబంటిని సురక్షితంగా బయటకు తీశారు. బావిలో నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటు తిరిగి అడివిలోకి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.