News
నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్

కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కాసేపట్లో షురూ కానుంది. ఇందుకోసం విశాఖ, ఏలూరు, గుంటూరులో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికి ఎమ్మెల్సీల ఫలితం తేలనుంది.
అయితే గ్రాడ్యుయేట్ ఫలితాలకు రెండురోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 35 టేబుళ్ల ఏర్పాటు చేయగా లెక్కింపు కోసం ఒక్కో టేబుల్ దగ్గర నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని నియమించారు.