Nandyala: కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి

Nandyala: నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందారు. మూడు రోజుల క్రితం త్రాగు నీటి పైప్లైన్లలో మురుగు నీరు కలిసి అస్వస్థకు గురయ్యారు. దీంతో ఇద్దరు మృతి చెందగా ఇవాళ మరొకరు మృతి చెందారు.
అయితే ఘటనపై విచారణ జరిపేందుకు వస్తునన కలెక్టర్ను సైతం కొందరు రాజా కీయ నాయకులు మధ్యలోనే ఆపి తప్పుడు నివేదికలతో తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అసలు ఘటనా స్థలానికి రాకుండా ఎలా నిర్ధారిస్తారని గ్రామస్తులు మండి పడుతున్నారు.
మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి, మరణాలకు కారణాలు వెల్లడించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మూడు రోజులైనా మరణాలకు, తాగు నీటి కాలుష్యానికి కారణాలను అధికారులు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణమైన అధికారులను శాఖాపరమైన చర్యల తీసుకోవాలని ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.