ఆంధ్ర ప్రదేశ్
East Godavari: భార్యను కత్తితో నరికిన భర్త

East Godavari: తూర్పుగోదావరి జిల్లా బంగారమ్మపేటలో దారుణం చోటుచేసుకుంది. భార్య, మామపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో దాడికి పాల్పడ్డాడు. అక్కడికక్కడే భార్య మృతిచెందాగా మామకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బంగారంపేటకు చెందిన తులసికి గుంటూరుకు చెందిన మురళీకృష్ణతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మామ వద్ద 50 వేల రూపాయిలను అప్పుగా తీసుకున్నాడు మురళీకృష్ణ. ఈ విషయమై వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో నాలుగు నెలలుగా భార్య, భర్తలు విడివిడిగా ఉంటున్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని భార్య తులసి, మామ నాగయ్య అడగడంతో వారిపై దాడి చేశాడు మురళీకృష్ణ. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.