తెలంగాణ
సైబర్ నేరస్తుల ముఠాపై వనపర్తి జిల్లా పోలీసుల ఉక్కుపాదం

సైబర్ నేరస్తుల ముఠాపై వనపర్తి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.4 లక్షలు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ లోన్ మంజూరు చేస్తామని మోసపూరిత కాల్స్ చేసి.. లక్షలాది రూపాయలు వసూలు చేసింది ముఠా. వనపర్తి జిల్లా గోపాలపేట మండలానికి చెందిన ఓ రైతు కుటుంబం ఈ ముఠా వలలో చిక్కింది.
బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 55 మంది నిందితులను గుర్తించారు. ఇప్పటికే ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న కీలక నిందితుడు వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇప్పటివరకు దాదాపు 10 లక్షలు కమీషన్గా సంపాదించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.