ఆంధ్ర ప్రదేశ్
చిరుత కలకలం.. మేకల మందపై దాడి.. భయాందోళనలో జనం

Leopard: సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చిరుత సంచారం కలకలం రేగింది. ఓబుల దేవర చెరువు మండలం కొండకమర్ల సమీపంలో చిరుత సంచరిస్తోంది. అటవీ ప్రాంతంలో మేకల మందపై దాడి చేసి.. మేకను చంపింది.
అయితే.. ఏక్షణాన వచ్చి చిరుత దాడి చేస్తోందోనని శేషయ్యగారిపల్లి తండాకు చెందిన గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు చిరుత సంచారం నేపథ్యంలో గుంపుగుంపులుగా జనం వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.