ఆంధ్ర ప్రదేశ్
Kakani: ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది

Kakani: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్,.. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో.. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ విధానాలు నచ్చక టీడీపీలో చేరమంటున్న కార్పొరేటర్లు.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాకాని.