ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో కొనసాగుతున్న హైటెన్షన్.. డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ

Tirupati: తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ నేత భూమన అభినయ్ బంధువు.. టౌన్ బ్యాంకు వైస్ ఛైర్మన్ ఇళ్ల దగ్గర గందరగోళ పరిస్థి తులు నెలకొన్నాయి. అదేవిధంగా కార్పొరేటర్ అనీష్ భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని సమాచారం.
ఈ క్రమంలోనే రెండు పార్టీల నేతలు దాడులు చేసుకున్నారని తెలు స్తుంది. ఈ దాడుల్లో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు పార్టీ నేతలకు సర్ది చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు.