తెలంగాణ
Jagadish Reddy: కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు

Jagadish Reddy: ఫోర్ ట్వంటీ హామీలిచ్చి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళుర్పించి.. వినతిపత్రం ఇచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. రైతు భరోసా డబ్బుల కోసం.. రైతులు వెయిట్ చేస్తున్నారని తెలిపారు. కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు జగదీశ్ రెడ్డి.