జాతియం

Sanjay Raut: మహారాష్ట్రకు మరో డిప్యూటీ సీఎం ఖాయం.. సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sanjay Raut: మహారాష్ట్రకు త్వరలో మూడో డిప్యూటీ సీఎం వస్తారంటూ శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్ నాథ్ షిండేపై విమర్శలు గుప్పించారు. ఏక్‌నాథ్ షిండేకి ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యత లేదని అన్నారు. షిండే వర్గానికి చెందిన నేతనే రాష్ట్రానికి మూడో డిప్యూటీ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు.

మహారాష్ట్రకు అదే పార్టీ నుంచి మూడవ ఉప ముఖ్యమంత్రి వస్తున్నందున ఆయన రేపు అక్కడ ఉండరన్నారు. శివసేన రెండుగా విడిపోవడంపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐలకు భయపడి వారు పారిపోయారని వ్యాఖ్యానించారు. శివసేన మాత్రం అన్నింటినీ తట్టుకుని బలంగా నిలబడుతోందని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button