Kolkata Doctor Murder Case: కోల్కతా హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ దోషి

Kolkata Doctor Murder Case: కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ పీజీ డాక్టర్ హత్యాచతార కేసులో నిందితుడ్ని కోర్టు దోషిగా తేల్చింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా తేలుస్తూ సిల్దా కోర్టు తీర్పు వెలువరించింది. నవంబర్ 12నుంచి ఈకేసుపై సిల్దా కోర్టు విచారణ చేపట్టింది. 50 మంది సాక్ష్యాలను పరిశీలించింది. ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. కోలకతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది.
నిందితుడు సంజయ్రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం సహా ఆర్జీకార్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్తో పాటు పలువుర్ని సీబీఐ ప్రశ్నించింది. కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్పత్రిలోని సెమినార్ హాల్ లో నిద్రిస్తున్న డాక్టర్ పై హత్యాచారం జరిగింది.కాగా.. ఈ ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసుపై శనివారం తుదితీర్పు వెలువడింది.