ఆంధ్ర ప్రదేశ్
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ అధికారులు ఫోన్ ద్వారా అంబటికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ కార్యాలయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. ఈ నెల 11న విచారణకు రావాలని గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే తనకు ఎలాంటి సమాచారం అందలేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.



