తెలంగాణ
Siddipet: విషాదం.. కొండపోచమ్మ సాగర్లో ఏడుగురు యువకుల గల్లంతు

Siddipet: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్లో విహార యాత్రకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. యువకులు ఫోటోలు దిగుతూ ప్రాజెక్టులో పడిపోయారు. ఐదుగురు యువకులు గల్లంతు కాగా.. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్గా అధికారులు గుర్తించారు. యువకులు మూషీరాబాద్కు చెందిన వారిగా అధికారుల తెలిపారు.