ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో బిల్గేట్స్ బృందం

అమరావతిలో బిల్గేట్స్ బృందం పర్యటిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో బిల్గేట్స్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనిత.. ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ఏపీ సచివాలయానికి బిల్గేట్స్ చేరుకోనున్నారు. చంద్రబాబుతో బిల్గేట్స్ భేటీ కానున్నారు. RTGS టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్పై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం నివాసంలో విందు తర్వాత బిల్గేట్స్ ఢిల్లీకి వెళ్లనున్నారు.



