తెలంగాణ
Mayor Vijayalakshmi: కూకట్పల్లిలో మేయర్ విజయలక్ష్మి పర్యటన

Mayor Vijayalakshmi: కూకట్పల్లి బాలానగర్ డివిజన్ పరిధిలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పర్యటించారు. నాలలో పూడికతీతను తీయకపోవడం వల్ల స్థానిక ప్రజలు నానారకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని వారి సమస్యలు పరిష్కరించాలని మేయర్ని రవీందర్ రెడ్డి కోరారు.
స్మశాన వాటికకు ఇరువైపులా గేట్లు కావాలని కోరారు. నాలాపై బ్రిడ్జి, రిటైనింగ్ వాల్స్ స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారి సమస్యలను ఒక్కొక్కటిగా త్వరగా పూర్తి చేయిస్తానని మేయర్ హామీ ఇచ్చారు.