తెలంగాణ

నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ బరిలో 58మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. మొత్తం 4 లక్షల ఒక వేయి 365మంది ఓటర్లు ఉన్నారు.

407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్‌కు 17 వందల 61 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్‌ను మానిటరింగ్ చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button