ఆంధ్ర ప్రదేశ్
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లక్ష్మీగణపతి ఫైర్ వర్స్క్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.



