ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి చేరుకున్న నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: మూడు రోజుల పర్యటన కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న ఆమెకు మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టి. టి.డి బోర్డు మెంబెర్ భానుప్రకాష్, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట రెవిన్యూ డివిజనల్ అధికారులు భానుప్రకాశ్ రెడ్డి, కిరణ్మయి, డి ఎస్ పి తదితరులు స్వాగతం పలికారు. మూడు రోజులపాటు ఆమె తిరుపతి, తిరుమలలో జరగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.



