ఆంధ్ర ప్రదేశ్
పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు

చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. యల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నష్టం చేశాయి. ఏడు ఏనుగుల మంద వ్యవసాయ క్షేత్రంలోని ఫెన్సింగ్ రాళ్లు, పంటలను ధ్వంసం చేశాయి. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్థానిక రైతులు, ఏనుగుల నుంచి పంట పొలాలను రక్షించాలని కోరారు.