ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నేడు క్వాంటమ్ వ్యాలీపై జాతీయ వర్క్షాప్

Chandrababu: నేడు విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై కూటమి ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అదేవిధంగా ఇందులో పాల్గొనేం దుకు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలువురు విజయవాడకు చేరుకున్నారు.
సీఎం చంద్ర బాబు ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న వారికి విందు ఇచ్చారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడంపై చర్చించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సహకారంతో దేశంలోనే మొదటి పార్కును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు.