తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్తో తండ్రి, కొడుకు మృతి

కొత్తగూడెం జిల్లా ఎల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్తో తండ్రీ-కొడుకులు మృతి చెందారు. ప్రస్తుతం తల్లి ఎర్రమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మహిళ ఎర్రమ్మను కాపాడేక్రమంలో నరసయ్య, ప్రవీణ్ మృతి చెందారు.
విషయం తెలుసుకున్న ఎస్సై నాగుల్ ఘటనా స్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఎర్రమ్మను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.