ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో కొనసాగుతున్నకేబినెట్ భేటీ

అమరావతిలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 31 అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. 1582.98 కోట్ల రూపాయలపెట్టుబడితో 8వేల మందికి కాగ్నిజెంట్‌ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది. అలాగే రాష్ట్రంలోని పలు సంస్థలకు, భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button