News

పెళ్ళాం స్కెచ్ వేసిందంటే.. భర్త మటాష్

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా..! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. అంటూ పెళ్లినాడు ప్రమాణాలు చేయిస్తారు. అంటే.. భర్త తన జీవనానికి ఆధారమైన మంగళ సూత్రాన్ని భార్య కంఠానికి కడతాడు. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్లు జీవించు అని అర్థం. కానీ.. మన దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే కొందరు మహిళలు వికృత పోకడలు పరాకాష్టకి వెళ్లి తమ మంగళసూత్రాన్ని తామే త్యజించడం సర్వసాధారణం అయిపోయింది.

మనసులో ఒకరిని పెట్టుకుని..మనువు మరోకరిని చేసుకుని మనసుపడ్డవాడితో మనువాడిని వాడిని చంపిస్తున్నారు. ఇలా ఒకటి రెండు కాదు..ఈ మధ్య జరుగుతున్న హత్యలన్నీ ఇలాంటివే మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ మొదలు కొని ఎన్నో సంఘటనలు. కర్కశంగా మారిన ఆడవారి చేతిలో అమాయకులు బలవుతున్నారు.

ఇష్టం లేకుంటే పెళ్లి చేసుకోవద్దు. లేదంటే తనకు ఇష్టమైన వాడితో వెళ్లిపోవచ్చు. కానీ ఈ మధ్య మహిళలు మరీ దారుణానికి ఒడిగడుతున్నారు. వారి ప్రేమ.. పెళ్లి చేసుకున్నవారికి శాపంగా మారుతోంది. ఇలా ఒకటి రెండు కాదు. ఈ మధ్య జరుగుతున్న హత్యలన్నీ ఇలాంటివే మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ మొదలు కొని ఎన్నో సంఘటనలు.

కర్కశంగా మారిన ఆడవారి చేతిల అమాయకులు బలవుతున్నారు. అలాంటిదే జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య. పెళ్లయిన నెల రోజులకే భార్య తన తల్లితో పాటు తల్లితో సంబంధం ఉన్న ఓ బ్యాంక్‌ మేనేజర్‌తో కలిసి భర్తను హత్య చేయించింది. ఈ కేసు యావత్తు తెలంగాణాలోనే నిర్ఘాంతపోయేలా చేసింది.

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ అనే వ్యక్తి ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్య అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి కేవలం ఐదు రోజుల ముందు ఐశ్వర్య అదృశ్యమవడం కలకలం రేపింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి తిరుమలరావుతో ఆమెకు సంబంధం ఉందని అతనితోనే వెళ్లిపోయి ఉంటుందని అందరూ భావించారు.

కానీ 16న తిరిగి వచ్చింది. తేజేశ్వర్‌కు ఫోన్‌ చేసి తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదని, కట్నం కోసం అమ్మ పడుతున్న బాధను చూడలేక స్నేహితురాలికి ఇంటికి వెళ్లానని నమ్మించింది. నువ్వంటే ఇష్టమని నీవు లేకుంటే బతకలేనని కన్నీళ్లు కార్చింది. కరిగిపోయిన తేజేశ్వర్‌ పెళ్లికి ఒప్పుకున్నాడు. అప్పటికే ఐశ్వర్యమీద అనుమానం ఉన్న తేజేశ్వర్‌ తల్లిదండ్రులు పెళ్లి వద్దన్నారు. కానీ అతను వినలేదు. తల్లిదండ్రులను ఒప్పించి, మే 18న ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు.

కానీ.. ఆమె మనసంతా తిరుమలరావు చుట్టే తిరుగుతుండేది. దీంతో.. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. గంటల తరబడి అతనితో మాట్లాడుతుండేది. ఇది నచ్చని తేజేశ్వర్‌ మందలించాడు. దీంతో తేజేశ్వర్, ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు మొదలైయ్యాయి.

ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఏపీలోని పాణ్యం సమీపంలో సుగాలిమెట్టు వద్ద తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది.

తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను, ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తోంది. అదే బ్యాంకుకు చెందిన ఉద్యోగి తిరుమలరావుతో సుజాతకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

తరుచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐశ్వర్యతోనూ తిరుమలరావుకు సంబంధం ఏర్పడింది. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం బహిరంగ రహస్యమేనంటున్నారు. తేజేశ్వర్‌తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తిరుమలరావును వదులుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదు.

దీంతో తేజేశ్వర్‌తో వివాహం జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య ఆ బ్యాంకు ఉద్యోగితో ఏకంగా 2,000 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను తొలగిస్తే, అతని ఆస్తి కూడా దక్కుతుందని భావించి హత్యకు పథకం పన్నింది. ఐశ్వర్య మీద మోజు తగ్గని బ్యాంక్‌ మేనేజర్‌ తేజేశ్వర్‌ను అడ్డు తొలగించుకోవడానికి సిద్ధమయ్యాడు.

తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాకుండా, తన డ్రైవర్‌ను కూడా వారి వెంట పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పథకం ప్రకారం జూన్ 17న కొందరు వ్యక్తులు తేజేశ్వర్‌ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దానిని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో అతడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

మార్గమధ్యంలో కారులోనే తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి, గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పడేసి వెళ్లిపోయారు హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించింది.

ఈ దారుణ ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా సుపారీ గ్యాంగ్‌లో కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను ఇప్పటికే అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

భర్తల అడుగుజాడల్లో నడవాల్సిన భార్యలు చివరకు అతడినే అంతమొందిస్తున్నారు. వివాహేతర సంబంధం, ఆస్తి లావాదేవీలు, అనుభవాలు, అనుమానాలు కలిసి అమాయకుల జీవితాలను బలిగొంటున్నాయి. మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ ఘటనను తలపించేలా, ఇది కూడా ప్రేమ పేరుతో జరిగిన పాశవిక నేరంగా మారింది.

ఆ దారుణ ఘటనలకు అక్రమ సంబంధమే ప్రధాన కారణంగా నిలిచింది. భర్తలను కాదు ఏకంగా తమ కడుపున పుట్టిన పిల్లలను, కన్నవాళ్లను సైతం కడతేరుస్తున్నారు కొందరు మహిళలు. ఈ దారుణాల్లో అధిక భాగం ప్రేమ వివాహం చేసుకున్న జంటలే ఉండటం కొసమెరుపు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button