తెలంగాణ
నేడు కేబినెట్ సమావేశం

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
- కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి కేబినెట్
- పరిపాలన పరమైన అంశాలు, నిర్ణయాలపైనే ప్రధాన చర్చ
- వాన కాలం పంటలకు రైతు భరోసా నిధుల పంపిణి రికార్డు
- ముగిసిన రెవెన్యూ సదస్సులు, 9 లక్షల అర్జీలు.. తదుపరి కార్యాచరణపై చర్చ
- స్పోర్ట్స్ పాలసీ పై చర్చ
- కాళేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వ మంత్రి వర్గ ఆమోదం ఉందా లేదా.. ఈ నెల 30 లోగా వివరాలు అందించాలని ప్రభత్వనికి లేఖ రాసిన పీసీ ఘోష్ కమిషన్.. లేఖపై ఈరోజు మంత్రి వర్గంలో చర్చించే అవకాశం
- ఏపీ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం. తదుపరి కార్యాచరణ పై చర్చ