తెలంగాణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక విచారణ

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. ఇవాళ మరోసారి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇతర నిందితులను విచారించనునున్నా రు. నేడు పోలీసుల ఎదుట ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నతోపాటు భుజంగరావులు హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు కేసులో సాక్షిగా టీ.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు.
ఇందులో భాగంగా మొత్తం 400 మంది స్టేట్మెంట్లు రికార్డు చేసే యోచనలో ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా రాజకీయ నేతలు, సీఎం రేవంత్ కుటుంబసభ్యులు ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి వివరాల సేకరించే ప్రయత్నం చేయనున్నారు.