Hyderabad: మాదాపూర్లో పబ్బులపై ఎస్వోటీ పోలీసుల తనిఖీలు

Hyderabad: భాగ్యనగరంలో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గచ్చిబౌలిలోని పలు పబ్బులపై ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. SLNటెర్మినల్ మాల్లోని పబ్బుల్లో, క్లబ్ రోగ్, ఫ్రాట్హౌస్ పబ్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ రైడ్స్లో భాగంగా ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. మొత్తం నలుగురికి గంజాయి పాజిటివ్గా తేలింది.
గంజాయి పాజిటివ్ వచ్చినవారిలో ఫ్రాట్ హౌస్ పబ్ డీజే ప్లేయర్ శివ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పబ్ డీజే ప్లేయర్కి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరి దగ్గర కొనుగోలు చేశాడు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
శివతో పాటు డ్రగ్స్ పాజిటివ్గా తేలిన మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేసి వారి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.