తెలంగాణ
Aadi Srinivas: ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారు

Aadi Srinivas: కేటీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. విచారణకకు వెళ్లే ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే బడాయి కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ఏసీబీ విచారణకు హాజరై వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే సరిపోతుందన్నారు.
సీఎం నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయాలంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరి మీద కేసు ఉంటే వాళ్లే విచారణకు హాజరువుతారు తప్ప ఇంకొకరు నార్కో ఎనాలసిస్ టెస్టులు చేసుకోరని ఆది శ్రీనివాస్ అన్నారు.