జాతియం
Air India: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

Air India: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో థాయ్లాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. థాయ్లాండ్ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
పుకెట్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి AI-379 విమానం బయలుదేరింది. అందులో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అండమాన్ సముద్రం పైనే విమానం చక్కర్లు కొట్టింది.
అనంతరం అధికారులు విమానాన్ని తిరిగి థాయ్లాండ్కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు స్క్వాడ్ బృందం విమానంలో తనిఖీలు చేస్తుంది. అయితే, బాంబు బెదిరింపు ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.