జాతియం
విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తు

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. రాత్రంతా ఘటనాస్థలం దగ్గర DGCA సోదాలు నిర్వహించింది. ప్రమాదం జరిగిన తీరుపై DGCA టీమ్ విశ్లేషించింది. ప్రస్తుతం ప్రాథమిక నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంజిన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇప్పటికే గుర్తించిన DGCA బృందం, ఇంజిన్లు పనిచేయకపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.
టేకాఫ్ అయిన నిమిషంలోనే క్రాష్ జరగడం సాంకేతిక లోపం గమనించకపోవడంపై దర్యాప్తును ముమ్మరం చేశారు. అదేవిధంగా టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే చేపట్టారు. బ్రిటిష్ ఏవియేషన్ అధికారులు అండ్ ఎయిరిండియా సీఈవో విల్సన్ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు.