జాతియం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది మృతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 265 మంది మృతి చెందారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ప్రాణాలతో ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ బయటపడ్డాడు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.
మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇక విమానం మెడికల్ కాలేజీపై క్రాష్ కావడంతో 24 మంది చనిపోయారు. మృతులంతా మెడికిల్ కాలేజీ వైద్యులు, సిబ్బందిగా తేల్చారు. ఇక DNA టెస్టుల తర్వాతే మృతుల వివరాలపై స్పష్టత రానుంది.