తెలంగాణ

Raja Singh: నా మొదటి పార్టీ టీడీపీ, చివరి పార్టీ బీజేపీ

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. రాజకీయాలను వదిలేస్తాను కానీ ఏ పార్టీలో చేరనని క్లారిటీ ఇచ్చారు రాజాసింగ్. అయితే పార్టీలో తనను వేధించే వారిని కూడా వదిలిపెట్టనని హెచ్చరించారు. పార్టీ నుంచి సస్పెండైనా 14 నెలలు దూరంగా ఉన్నానని గుర్తుచేశారు. తనకు బీజేపీ తప్ప వేరే పార్టీలో వెళ్లే ఉద్దేశం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

అందుకే కొంతమంది తనతో ఆటలాడుతున్నారంటూ విమర్శించారు. వాళ్లకీ తెలుసు కనుకనే వేరే ఏ పార్టీలోకి వెళ్లననన్నారు రాజాసింగ్. ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చూసే బీజేపీలో ఉన్నానని చెప్పిన రాజాసింగ్ వారు ఇరువురు లేకపోతే ఎప్పుడో తాను పార్టీని విడిచి వెళ్లేవాడినన్నారు గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button