తెలంగాణ
ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బాధితుల ఆందోళన

ప్రభుత్వాలు మారిన ములుగు జిల్లాలోని పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలో భాగంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సర్వే కూడా నిర్వహించింది.
కానీ అర్హులైన వారి పేర్లను మొదటి లిస్టులో సెలెక్ట్ చేసినా అధికారులు మత్రం ఫైనల్ లిస్టులో అధికార పార్టీ మండల నాయకులు చెప్పిన వారికే ఇండ్లు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇల్లు లేని పేదలకు కాకుండా పక్కా ఇండ్లు, పొలాలు ఉన్నవారికి కేటాయించారని బాధితులు వాపోతున్నారు.