ఆంధ్ర ప్రదేశ్
Anagani Satya Prasad: గత ప్రభుత్వంలో జరిగినన్ని స్కాంలు ఎన్నడూ జరగలేదు

Anagani Satya Prasad: మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో స్కాంలు చేశారని అప్పుడు జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీంగా మేము పనిచేస్తున్నామన్నారు. టూరిజం పెంపొందించాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు. ఇక మసుల బీచ్ ఫెస్టివల్ అద్భుతంగా ఏర్పాటు చేసిన కొల్లు రవీంద్రకి అభినందనలు తెలిపారు. ఇక్కడ ఆటల పోటీల్లో బీచ్ కబడ్డీ, కాయకింగ్, వాలీబాల్ ఏర్పాటు చేడయం మంచి అభిప్రాయమన్నారు.
ఇక భవిష్యత్తులో ఇంటర్నేషనల్ గేమ్స్ కండక్ట్ చేస్తామన్నారు. కేవలం వ్యవస్థలు నిర్వీర్యం చేయడమే నైజంగా గత ప్రభుత్వాలు నడిచాయన్నారు. జర్నలిస్టులను బాగుండాలని కోరుకుంటామని మంత్రి అన్నారు. మహిళలను కించపరిచేలా వారి ఛానల్లలో డిబేట్లు కండక్ట్ చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.