Ponguru Narayana: జగన్కు ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదు

Ponguru Narayana: మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత తాను రిలాక్స్ అయ్యానని అన్నారు. 80 అడుగుల ఎత్తుతో గేట్ వే ఆఫ్ నిర్మాణం చేశారని, 10 ఏళ్ల వరకు ఎవరు కదపలేని విధంగా నిర్మాణ చేశారన్నారు. రోల్డ్ గోల్డ్, కలంకారి, వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారని, సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారని, 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్కు 10 లక్షల మంది వచ్చారని.. ఈసారి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి అన్నారు. మాజీ సీఎం జగన్కు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభినం చేశారని రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.