ఆంధ్ర ప్రదేశ్
Budda Venkanna: జగన్, పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలు కొత్త స్కాం చేశారు

Budda Venkanna: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని గతంలో ఉండేదని కానీ జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోయేలా చేశారని విమర్శలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు కొత్త స్కాం చేశారని ఆరోపణలు చేశారు. మద్యం అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు వేలమంది ప్రాణాలు తీశారని విమర్శించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా ముగ్గురూ పంచుకున్నారన్నారు.