తెలంగాణ
Telangana Cabinet: ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలలో రెండింటిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్టు ఏర్పాటు చేయడానికి నిర్ణయంతీసుకుంది.
ప్రతినెలా 700 కోట్ల రూపాయల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే 10 లక్షలు రూపాయలు చెల్లించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర మూడు మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని 19వేల 579కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. కాగా త్వరలో మరోసారి మంత్రివర్గం సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. క్యాబినెట్లో మొత్తం 70కి పైగా అంశాలపై చర్చించారు.