ఆంధ్ర ప్రదేశ్
Mahanadu: మహానాడులో ఏఐ ఎన్టీఆర్ సందడి

Mahanadu: మహానాడు వేదికగా ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంది. అవును సీనియర్ ఎన్టీఆర్ ఏఐ వీడియో సందడి చేసింది. మొత్తానికి ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఏఐ ప్రసంగంతో తెలుగు తమ్ముళ్లులో జోష్ కనిపించింది. సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.
సికింద్రాబాద్కు ట్యాంక్ బండ్తో తాను సాంస్కృతిక వారథి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారిథిని కట్టించిన వాడు చంద్రబాబు అన్నారు. లక్షల రూపాయల జీతం గురించి ఏ నాడైనా కలగన్నామా?.. దాన్ని సాధ్యం చేసింది తెలుగు దేశం ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు ఎన్టీఆర్.