ఆంధ్ర ప్రదేశ్

Vidadala Rajini: రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై కేసు నమోదు చేశారు

Vidadala Rajini: గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు.చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలే ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పామన్నారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా’’ అంటూ విడదల రజిని నిలదీశారు.

రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరిందన్నారు. నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గంలో టీడీసీలో ఆధిపత్య పోరులో మర్డర్ జరిగిందన్నారు.

మృతుని కుటుంబ సభ్యులు తెలుగుదేశం వారే చంపారని చెబుతున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ప్రకటించారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పై పెట్టిన అక్రమ కేసును తొలగించాలి. లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని విడదల రజిని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button