ఆంధ్ర ప్రదేశ్
Vijayawada: విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి

Vijayawada: విజయవాడలోని పటమటలో తీవ్ర విషాద ఘటన నెలకొంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందిన ఘటన బెంజ్ సర్కిల్ లోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నాడు. ఒకరిని కాపాడబోయి మరొకరు చనిపోయారని స్థానికులు వివరించారు.