ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

Corona: ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కడపలోనూ ఇప్పుడు కరోనా కలకలం రేగింది. రిమ్స్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ వచ్చింది.
బాధితుడు నంద్యాల జిల్లాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అదేవిధంగా నిన్న పిఠా పురం కాలనీకి చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు మూడుకి చేరాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.