ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: విషాదం.. గ్రానైట్ క్వారీలో పేలుడు .. ముగ్గురు మృతి

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మనీషా కూనపురెడ్డి గ్రానైట్ క్వారీలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మెళియాపుట్టి మండలం దీనబంధుపురంలో ఘటన జరిగింది.
మృతులు అప్పన్న, రామారావు, పుంగవేణుగా గుర్తించారు. అయితే క్వారీ యాజమాన్యం మాత్రం పిడుగు పడి చనిపోయారని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.