తెలంగాణ
CPI Narayana: పహల్గాం ఉగ్రవాదులను పాక్ వెంటనే అప్పగించాలి

CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. జమ్మూకశ్మీర్లో కొంతమంది ఇప్పటికీ ఆయుధాలతో తిరుగుతున్నారని అన్నారు నారాయణ. జమ్ముకాశ్మీర్లో పానీపూరి అమ్ముకునే వ్యక్తికి తెలిసిన సమాచారం కూడా కేంద్ర నిఘా వర్గాలకు తెలియడం లేదన్నారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను పాకిస్థాన్ వెంటనే అప్పగించాలన్నారు. ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతే భారత్ చర్చలకు వెళ్లాలని నారాయణ కేంద్రానికి సూచించారు.
దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీ నేతలే దేశం విడిచి వెళ్లిపోవాలన్నారు. నక్సలైట్లను చంపేస్తానని అమిత్ షా చెప్పడం పద్ధతి కాదన్నారు. అమిత్ షా వెంటనే నక్సలైట్లను చర్చలకు పిలవాలన్నారు నారాయణ. ఆపరేషన్ సింధూర్ లో యుద్ధం చేసిన సోఫియాపై బిజెపి మంత్రి విజయ్ షాను వెంటనే పదవి నుంచి తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు.