ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలోని పల్లివీధిలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra: తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా పల్లివీధిలోని వేషాలమ్మ ఆలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించమని వారిపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన జగన్ను, పెద్దిరెడ్డిని వదలి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు.