ఆంధ్ర ప్రదేశ్
ఆడుకుంటూ.. బాలుడు మృతి

AP News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. అరుంధతీ కాలనీకి చెందిన వినయ్ తోటి స్నేహితులతో ఆడుకుంటూ మృతి చెందాడు. ఆడుకుంటూ డాబా మీద ఉన్న బియ్యం డబ్బాలో దాక్కున్నాడు. ఆ సమయంలో డబ్బా మూత మూసుకుపోయింది. ఎంతకీ బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బంధువుల సాయంతో వెతుకుతుండగా డాబాపై ఉన్న బియ్యం డబ్బాలో బాలుడి మృత దేహం కనిపించింది. ఆటలాడుకునే తమ కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.