జాతియం

India Pakistan War: భారత్‌పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు

India Pakistan War: హైదరాబాద్ మాదాపూర్‌లో హైటెన్షన్ నెలకొంది. టర్కీ ఆఫీస్ వద్ద బలగాలు మోహరించాయి. చెప్పాలంటే భారత్‌పై పాక్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలోనే భారత్ చేసిన సాయాన్ని మరిచి టర్కీ పాకిస్థాన్‌కు సాయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. 2023 టర్కీలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయింది. ఆ సమయంలో భారత్ ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ పేరిట 8లక్షల 45వేల 590 డాలర్ల విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలు చేసి ఆదుకుంది.

ఆపదలో ఎంతో సాయం చేసిన భారత్‌ను మాత్రం టర్కీ మర్చిపోయింది. భారత్‌కు శత్రు దేశం అయిన పాకిస్థాన్‌కు టర్కీ ఆయుధ సామాగ్రిని పంపిణీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చర్యలకు సిధ్దం అవ్వడంతో టర్కీ నుండి పాక్ డ్రోన్లను తెప్పించికున్నట్టు తెలుస్తోంది. మూడు విమానాల్లో డ్రోన్లతో పాటూ ఆయుధ సామాగ్రిని టర్కీ సరఫరా చేసినట్టు సమాచారం.

రెండు రోజుల క్రితం కూడా ఇస్లామాబాద్‌కు మరో టర్కీ విమానం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టర్కీ పాకిస్థాన్ కు సాయం చేసినప్పటికీ ఆ డ్రోన్లను భారత ఆర్మీ బూడిద చేసింది. భారత్ వద్ద ఉన్న బలమైన క్షిపణులతో గగనతలంలోనే డ్రోన్లను పేల్చివేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button