జాతియం
Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. భగ్నం చేసిన భారత సైన్యం

Operation Sindoor: దాయాది పాకిస్తాన్ బరితెగించింది. పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జలంధర్ గ్రామీణ ప్రాంతంలోని కంగనివాల్ గ్రామంలో పేలుళ్లకు పాల్పడింది. అయితే పాక్ దాడులను భారత్ తిప్పికొట్టింది. భారత్ బలగాలు డ్రోన్లను ధ్వంసం చేశాయి. అనంతరం డ్రోన్ల భాగాలను ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది.