ఆంధ్ర ప్రదేశ్
Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగింది

Nimmala Ramanaidu: జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ రంగాన్ని అధ్వానంగా మార్చారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ, మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.