జాతియం
Pahalgam Terror Attack: భారత్ సంచలన నిర్ణయం.. పాక్ పౌరులు దేశం విడిచి పోవాలి

Pahalgam Terror Attack: పాకిస్తాన్ తీరుపై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పలు కీలక డిసీషెన్స్ తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది.
SAARC వీసా ఉన్న పాక్ పౌరులు పర్యాటకులు 48 గంటల్లో భారత్ వీడాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అటారీ-వాఘా సరిహద్దు మూసివేస్తున్నట్లు తెలిపింది. పాక్ పౌరులను ఇకపై భారత్లోకి అనుమతించబోమని తేల్చి చెప్పింది.